బిపిన్ రావత్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి

by  |
బిపిన్ రావత్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ మరణం పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. బిపిన్ రావత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ‘బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. మాతృభూమికి బిపిన్ రావత్ చేసిన నాలుగు దశాబ్దాలగా నిస్వార్థ సేవ చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

అటు బిపిన్ రావత్ మరణం పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మర్షవర్దన్, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధ్యక్షడు శరద్ పవార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు.

Next Story