‘సీఎం జగన్ స్పందించకపోతే అంతే’

by  |
‘సీఎం జగన్ స్పందించకపోతే అంతే’
X

దిశ ఏపీ బ్యూరో: టీటీడీ ఈవో, డిప్యూటీ ఈవోపై టీటీడీ ఆగమ సలహాదారు, ప్రధానార్చకులు రమణ దీక్షితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, “తిరుమల శ్రీవారి ఆలయంలో 50 మంది అర్చకులు విధులు నిర్వర్తిస్తుంటే అందులో 15 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. ఇంకా 25 మందికి చెందిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈవో, డిప్యూటీ ఈవో దర్శనాలు నిలిపివేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనిని బట్టి అర్చకులపై వారికున్న భావమేపాటిదో అర్ధమవుతుంది” అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోతే ఉపద్రవం ముంచుకొస్తుందని అన్నారు.

Next Story

Most Viewed