ఏసీపీ వార్నింగ్ తర్వాత హీరో రామ్ మరో ట్వీట్ 

by  |
ఏసీపీ వార్నింగ్ తర్వాత హీరో రామ్ మరో ట్వీట్ 
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో రామ్ పోతినేనికి విజయవాడ ఏసీపీ సూర్య చంద్రరావు వార్నింగ్ ఇచ్చారు. స్వర్ణ ప్యాలస్ ఘటనపై స్పందించిన రామ్.. సీఎం జగన్ పై కుట్ర జరుగుతోంది… ఆయనకు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ రాజకీయ సంచలనంగా మారింది.

కాగా స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను విజయవాడ ఏసీపీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డాక్టర్ మమత, డాక్టర్ సౌజన్యను విచారించాము. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్ కి కూడా నోటీసులు పంపిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఏసీపీ ప్రెస్ మీట్ అయిన కొద్దిసేపటికే రామ్ మరో ట్వీట్ చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఇంకోసారి ట్వీట్ చేయనని రామ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. న్యాయంపై తనకు నమ్మకముందని, ఎవరైనా, ఎవరికి చెందిన వారైనా నిజమైన దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం ఉందన్నారు.

https://twitter.com/ramsayz/status/1294922239574384640?s=20

Next Story