- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదంగా మారుతుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ అమృతల ప్రేమ కథ ఆధారంగా ‘మర్డర్’ సినిమా తెరకెక్కిస్తూ మరో సంచలన ప్రకటన చేసి, సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. అయితే ఈ ‘మర్డర్’ సినిమా విషయంలో కొనసాగుతున్న వివాదంపై వర్మ రేపు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘మర్డర్’ సినిమా మారుతీరావు కథకు సంబంధించినది కాదని.. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అన్నారు. అసలు విషయం తెలియక కోర్టుకెక్కారని.. కుటుంబ గౌరవాన్ని చెడగొడ్తున్నారన్న భావోద్వేగాలు మానవ సహజం అని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రేపు (డిసెంబర్ 22న) మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఆ ప్రెస్మీట్లోనే సినిమా గురించి పూర్తి వివరాలు ప్రపంచానికి తెలియజేస్తానని తెలిపాడు. కాగా ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.