- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ప్రముఖ చానల్లో ఆగస్టు 15 నుంచి ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ షో కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ షో కి సంబంధించి 16 ఎపిసోడ్లను తారక్ పూర్తిచేసాడంట. అంతేకాదు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ తో ఓ స్పెషల్ ఎపిసోడ్ ని కూడా షూట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే చెర్రీని తారకు చిత్ర విచిత్రమైన ప్రశ్నలను అడిగారని, కొన్నింటికి సమాధానం చెప్పి చరణ్ రూ. 25 లక్షల రూపాయలు గెలుచుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
కోటి రూపాయలు గెలుచుకునే ఈ క్విజ్ పోటీల్లో చరణ్ కష్టపడి రూ. 25 లక్షలు గెలుచుకున్నారట. ఫైనల్ టార్గెట్ రీచ్ కాలేకపోయినా.. అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న సంతృప్తితో చరణ్ బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మధ్య మధ్యలో చెర్రీ- తారక్ ల హంగామా హైలైట్ గా నిలవనుందంట. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఆగస్టు 16న టెలికాస్ట్ చేయనున్నారట. ఈ న్యూస్ తో చెర్రీ- తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ షో వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.