ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన చెర్రీ

by  |
ఆర్ఆర్ఆర్ టీమ్‌కు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన చెర్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ చాలెంజ్‌లో టాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా బాహుబలి ప్రభాస్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన రాంచరణ్.. తన నివాసంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.

‘ప్రభాస్ ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. నా వంతు బాధ్యతగా 3 మొక్కల్ని నాటాను. ఈ సందర్భంగా హీరోయిన్ ఆలియా భ‌ట్, దర్శకుడు రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ మొత్తాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను. వారందరూ చాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాలి. నా అభిమానులు కూడా ఈ పనిలో భాగస్వాములై ఈ చైన్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు నా కృతజ్ఞతలు’ అని రాంచరణ్ ట్వీట్ చేశారు. దీనికి జతగా ఆయన మొక్కలు నాటిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.


Next Story

Most Viewed