ఐదు పాత్రల చుట్టూ ‘రాళ్లలో నీరు’

by  |
ఐదు పాత్రల చుట్టూ ‘రాళ్లలో నీరు’
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ కిరణ్మయి ఇంద్రగంటి తొలిసారి ఫీచర్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ‘ఏ డాల్స్ హౌజ్’ బేస్ చేసుకుని తీస్తున్న సినిమాకు ‘రాళ్ళలో నీరు’ టైటిల్ ఖరారు కాగా.. హిడెన్ వాటర్ అనేది ట్యాగ్ లైన్. అనల్ప అండ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృష్ణ మంజుష, అథ్లఫ్, షఫి, బిందు చంద్రమౌళి, డాక్టర్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆర్‌ఆర్ కోలంచి సినిమాటోగ్రాఫర్ కాగా, మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ఎం.ఏ. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునే రోజుల్లో ‘ఏ డాల్స్ హౌజ్’ నాటకం తనను ఆకట్టుకుందని.. ఎలాగైనా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యానని తెలిపారు డైరెక్టర్ కిరణ్మయి ఇంద్రగంటి. కన్యాశుల్కం తరహాలో ఉండే ఈ నార్వేజియన్ నాటకాన్ని ప్రముఖ రచయిత హెన్రిక్ ఇబ్బన్ రచించగా.. నేటివిటీ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కథ సిద్ధం చేసినట్లు చెప్పారు. కేవలం ఐదు పాత్రల చుట్టూ సాగే సినిమా లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అవేర్‌నెస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వచ్చిందని, కాకినాడలో 28 రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరుపుకున్న సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉందని చెప్పారు.

Next Story