రకుల్ కల నిజమైంది..!

by  |
రకుల్ కల నిజమైంది..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు ప్రతీ ఒక్క యాక్టర్‌కు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే డ్రీమ్ ఉంటుంది. కానీ, చాలా తక్కువ మందికి మాత్రమే ఆ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యే చాన్స్ ఉంటుంది. ఆ అతికొద్ది మంది లిస్ట్‌లో చేరిపోయింది బ్యూటీఫుల్ రకుల్ ప్రీత్ సింగ్.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ దర్శకత్వంలో వస్తున్న‘మే డే’ సినిమాలో సీనియర్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా..అందులో రకుల్ కూడా జాయిన్ కాబోతుందట. ఈ చిత్రంలో రకుల్ అజయ్ కోపైలట్‌గా కనిపించనుంది. ‘మే డే’తో బచ్చన్ జీతో నటించాలన్న తన కల నిజం కాబోతుందన్న రకుల్.. ‘దే దే ప్యార్ దే’ సినిమా తర్వాత అజయ్ దేవగన్‌తో మరోసారి నటించబోతుండడం సంతోషంగా ఉందని తెలిపింది. తను ఈ సారి డైరెక్టర్ కూడా కావడం థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పింది. ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుండగా.. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ‘మే డే’ను తన ఓన్ ప్రొడక్షన్ హౌజ్ ఏడీఎఫ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు అజయ్ దేవగన్.

ప్రస్తుతం రకుల్ క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. దీంతోపాటు నితిన్ హీరోగా వస్తున్న ‘చెక్’ సినిమాలోనూ రకుల్ ఫీమేల్ లీడ్‌గా కనిపిస్తుండగా.. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకులు.

Next Story

Most Viewed