త్వరలో మీ ముందుకు : రకుల్

by  |
త్వరలో మీ ముందుకు : రకుల్
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల తార రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఇటీవలే కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఆమె హోమ్‌ క్వారంటైన్‌లో ఉంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆమె తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. కొవిడ్ నుంచి బయటపడటానికి తాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది. తన గదిలోంచి అస్సలు బయటకు రావడం లేదని, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ చక్కటి పౌష్టికాహారం తీసుకుంటున్నానని పేర్కొంది.

విటమిన్‌ మాత్రలు వేసుకుంటున్నానని, అభిమానుల ప్రేమాభిమానాలు, ప్రార్థనలతో త్వరలోనే కరోనాను అధిగమించి అందరి ముందుకు వస్తాననే విశ్వాసం ఉందని వీడియాలో చెప్పింది. వీడియో చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రకుల్.. తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్ హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో నటించింది. చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇందులో ఆమె రాయలసీమకు చెందిన పల్లెటూరి యువతి ‘ఓబులమ్మ’ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నితిన్‌ ‘చెక్‌’ మూవీలో రకుల్‌.. న్యాయవాది పాత్ర పోషిస్తోంది.



Next Story

Most Viewed