- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ ఫిట్నెస్, హెల్త్పై ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ మధ్య తన ఫ్రెండ్ మంచు లక్ష్మీ ప్రసన్నతో కలిసి సైక్లింగ్కు వెళ్లిన రకుల్.. ఇప్పుడు సమంత కోసం మొక్కలు పెంచుతోంది.
లాక్డౌన్లో గార్డెనింగ్ చేసిన సమంత.. ఇంట్లోనే సొంతంగా కూరగాయలు పండించడం ద్వారా చాలా లాభాలున్నాయని.. చాలా గొప్ప అనుభూతిని కూడా కలుగుతుందని చెప్పింది. ఇప్పటికే తన పెరట్లో పెరిగిన కూరగాయలు, మొక్కలను ఆహారంగా తీసుకుంటున్న సామ్.. ఇందువల్ల కలిగే లాభాలను కూడా వివరించింది. ఈ క్రమంలో ‘గ్రో విత్ మి’ చాలెంజ్ ప్రారంభించిన సామ్.. రకుల్ను నామినేట్ చేసింది.
ఈ చాలెంజ్ స్వీకరించిన రకుల్.. ‘ప్రకృతితో అనుబంధం పెంచుకుందాం’ అని అభిమానులకు పిలుపునిచ్చింది. మనం ఏది తింటున్నామో.. అదే మనం అన్న రకుల్.. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విత్తనాలు మొక్కలుగా పెరగడం ఓ అద్భుతమైతే.. అది మన ద్వారా జరగడం ఇంకా అందమైన అనుభవమని చెప్తోంది. మనం పండించిన ఆహారం వ్యక్తిగత శరీర అవసరాలకు అనుగుణంగా మారుతుందన్న రకుల్.. గ్రో విత్ మి చాలెంజ్కు నామినేట్ చేసిన సామ్కు థాంక్స్ చెప్పింది.
https://www.instagram.com/p/CERP9wsBEU7/?igshid=aoalznxbmsq4