ఈడీ ఎదుట రకుల్.. ఎఫ్ క్లబ్ చుట్టూ విచారణ

by  |
Rakul preeth
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ కేసులో ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది సేపటి క్రితమే ఈడీ విచారణ పూర్తయింది. దాదాపు 7 గంటల పాటు సాగిన విచారణలో తనకు కావాల్సిన సమాచారాన్ని రకుల్ అందించారని తెలిపారు. మొత్తం ఐదుగురు సభ్యుల బృందం విచారించినట్లు ఈడీ తెలిపింది. రకుల్ కు సంబంధించిన మూడు బ్యాంకు అకౌంట్ల వివరాలపై ఆరా తీసినట్లు తెలిపారు. అందులో హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో అకౌంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎఫ్ క్లబ్ మేనేజర్, నవదీప్, కెల్విన్ తో జరిపిన లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలిపారు. అలాగే రియా చక్రవర్తితో ఉన్న పరిచయాలపై ఆరా తీశారు. కెల్విన్, ఎఫ్ క్లబ్ మేనేజర్ అకౌంట్లకు అన్ని సార్లు డబ్బు పంపించాల్సినా అవసరం ఏమొచ్చిందని విచారించినట్లు చెప్పారు.



Next Story

Most Viewed