ఆస్ట్రేలియాలో నాగర్ కర్నూల్ యువతి మృతి

by  |
ఆస్ట్రేలియాలో నాగర్ కర్నూల్ యువతి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువతి మరణించింది. మృతురాలు వంగూరు మండలం డిండి చింతపల్లికి చెందిన రక్షిత (22)గా గుర్తించారు. సిడ్నీలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రక్షిత ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదువుతోందని సమాచారం. మృతురాలి తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వెంకట్ రెడ్డిగా తెలుస్తోంది. విషయం తెలియడంతో యువతి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story

Most Viewed