‘2024 వరకూ ఢిల్లీలో రైతు ఉద్యమం’

by  |
‘2024 వరకూ ఢిల్లీలో రైతు ఉద్యమం’
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ నేత రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త చట్టాల రద్దు, మద్దతు ధరపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. చర్చల్లో రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించకపోతే 2024 వరకూ ఆందోళన కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని రాకేష్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం సవరణలు అంగీకరించిన రైతు దేశద్రోహా అన్నారు. కాగా, ఈరోజు కేంద్రం నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed