అదంతా కృత్రిమ ఉద్యమం : పిల్లి సుభాష్ చంద్రబోస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-05 05:19:07  IST  )

<p>దిశ ఏపీ బ్యూరో: అమరావతి ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ వాస్తవాలు చెప్పలేదని మండిపడ్డారు. పెట్టుబడి దారులు 33 వేల ఎకరాలు సేకరించిన తరువాతే అమరావతిని రాజధానిని చేశారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రాజధాని ఉద్యమం చేస్తున్న 29 గ్రామాల్లో చంద్రబాబు నాయుడు కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శలు [&hellip;]</p>

అదంతా కృత్రిమ ఉద్యమం : పిల్లి సుభాష్ చంద్రబోస్
X

దిశ ఏపీ బ్యూరో: అమరావతి ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ వాస్తవాలు చెప్పలేదని మండిపడ్డారు. పెట్టుబడి దారులు 33 వేల ఎకరాలు సేకరించిన తరువాతే అమరావతిని రాజధానిని చేశారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రాజధాని ఉద్యమం చేస్తున్న 29 గ్రామాల్లో చంద్రబాబు నాయుడు కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Next Story