అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.. ఎంపీ బడుగుల వార్నింగ్

by  |
Rajya Sabha member Badugula Lingaiah Yadav
X

దిశ, నల్లగొండ: పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉటుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లాంటిది అని, పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లింగయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ… అక్టోబరు 2వ తేదీ నుంచి టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవడానికి షెడ్యూల్ ప్రకటించారని తెలిపారు. 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామస్థాయిలో, 13 నుంచి 20 వరకు మండల, పట్టణ, స్థాయిలో, 20 నుంచి జిల్లా స్థాయిలో అనుబంధ సంఘాల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం పార్టీ పరిశీలకులను ఆయా ప్రాంతాలకు పంపించడం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కనగల్ తిప్పర్తి ఎంపీపీలు కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మీ, కనగల్ జెడ్పీటీసీ చెట్ల వెంకటేశం, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ వలి, కటికం సత్తయ్య గౌడ్, బక్క పిచ్చయ్య, ఫరీదుద్దీన్, సింగం రామ్మోహన్, మైనం శ్రీనివాస్, తిప్పర్తి, నల్లగొండ కనగల్ మండల అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, సింగిల్విండో చైర్మన్‌లు పాశం సంపత్ రెడ్డి, బంగాల సహదేవరెడ్డి, ఆలకుంట నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్, కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed