జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

by  |
జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
X

వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అమరావతిలో కలిశారు. అమరావతి పరిధిలోని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వైఎస్సార్సీపీ ప్రతిపాదిత రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని, మోపిదేవి వెంకటరమణరావులు వెళ్లారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన జగన్‌, వారికి బీ-ఫామ్‌లను అందజేశారు. నలుగురూ శాసనసభకు వెళ్లి వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్‌‌లు వేశారు. ఈ సమయంలో వారితో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలు కూడా ఉన్నారు.

Tags: ysrcp, rajya sabha candidates, jagan, pilli subhash chandra bose, parimal nathwani, ayodhyaramireddy, mopidevi venkatramanarao, assembly

Next Story