రాజ్యసభ, లోక్ సభ టీవీలు విలీనం

by  |
Sansad TV
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ, లోక్ సభ టీవీలను కలిపి సంసద్ టీవీగా రేపటి నుంచి ప్రసారాలను ప్రారంభించనున్నారు. 1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో జరిగిన మొదటి ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగి నూరేళ్లు అయిన సందర్భంగా బుధవారం 81వ ఆల్ ఇండియా అసెంబ్లీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ల సమావేశం నిర్వహిస్తున్నారు. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్‌లో లోక్ సభ స్పీకర్ అధ్యక్ష హోదాలో పాల్గొంటారు. అదే విధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మరియు దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, 6 రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్లు కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు.

తెలంగాణ నుంచి శాసనసభ భవనంలో ఏర్పాటు చేసిన వర్చువల్ పద్ధతిలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొంటారని లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


Next Story

Most Viewed