థర్డ్ వేవ్‌పై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

by  |
థర్డ్ వేవ్‌పై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకవేళ థర్డ్ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. రెండు వేవ్‌లతో రాష్ట్రాలు సరైన పాఠాలు నేర్చుకున్నాయని, సాధ్యమైనంత త్వరగా కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా.. ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగతున్నాయి. వారం రోజులుగా 40 వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇది మూడో వేవ్‌కు సంకేతమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed