హింసను అదుపు చేయడంలో కేంద్రం వైఫల్యం

by  |
హింసను అదుపు చేయడంలో కేంద్రం వైఫల్యం
X

ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసపై తమిళ సూపర్ స్టార్ రజనీ‌కాంత్ తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హింసను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర పెద్దలు రాజీనామా చేయాలని రజనీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ‘ దేశంలో శాంతిని పెంపొందించడంలో నా వంతు కృషి చేస్తా. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా’ అంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఆదివారం రజనీకాంత్‌తో పలువురు ముస్లిం పెద్దలు చెన్నైలో భేటీ అయ్యారు.

Next Story