బోధన్ ఆర్డీవోగా రాజేశ్వర్

by  |
బోధన్ ఆర్డీవోగా రాజేశ్వర్
X

దిశ, బోధన్: బాన్సువాడ ఆర్డీవోగా పని చేసి ఇటివల బోధన్ కు బదిలీ అయిన కె. రాజేశ్వర్ సోమవారం భాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయం అధికారులు, డివిజనల్ తహసీల్దార్లు స్వాగతం పలికారు. రాజేశ్వర్ గతంలో బోధన్ లో తహసీల్దార్ గా పనిచేశారు. బోధన్ నుంచి కోటగిరి తహసీల్దార్ గా వెళ్లి అక్కడి నుంచి బాన్సువాడ ఆర్డీవోగా పదోన్నతి పొందారు. అక్కడ మూడు సంవత్సరాలపాటు పని చేసిన తరువాత బోధన్ కు ఆర్డీవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని, అందరి సహయ సహకారాలు కావాలని రాజేశ్వర్ కోరారు.

Next Story

Most Viewed