టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

by  |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా ఆదివారం మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఆరు మ్యాచ్‌లు, రాజస్థాన్ ఆరు మ్యాచ్‌లు గెలిచాయి. ప్లేఆఫ్స్‌లో ఛాన్స్‌ కోసం పోటీ పడుతున్నాయి. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారనుంది. ఓడిన జట్టు ప్లేఆఫ్స్ నుంచి, టోర్ని నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో తడబడిన రాజస్థాన్ టోర్నమెంట్ చివర్లో అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. కోల్‌కతా మొదట్లో జోరు చూపించినా చివరల్లో వరుస ఓటములను ఖాతాలో వేసుకుంది. కాగా ఇరు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమాన బలాలు కలిగి ఉన్నాయి. మరి ఏ జట్టుపై ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Next Story

Most Viewed