ఐపీఎల్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

by  |
rishab pant, sanju samson
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2021లో నేడు రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 : 30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే… మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ని చిత్తుగా ఓడించేసింది ఢిల్లీ క్యాపిటల్స్‌. అలాగే పంజాబ్ కింగ్స్‌కి చివరి బాల్ దాకా ముచ్చెమటలు పట్టించేసింది రాజస్థాన్ రాయల్స్. రెండు టీంలలోనూ టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. అంతేగాకుండా… ఈ రెండు జట్ల పోటీ వారి కెప్టెన్లపై ఉంటుంది. రిషబ్ పంత్, సంజు సామ్సన్ మధ్యే గెలుపు ఓటములు ఉంటాయి. ఈ ఇద్దరు ఆటగాళ్ల క్రీడపై ఇది చాలా వరకు ఆధారపడి ఉంటుంది. మరి ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.



Next Story