మనీశ్ పాండే మ్యాచ్ లాగేసుకున్నాడు : స్మిత్

by  |
మనీశ్ పాండే మ్యాచ్ లాగేసుకున్నాడు : స్మిత్
X

దిశ, వెబ్‌డెస్క్: గురువారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌పై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌లు రాణించడంతో రాజస్థాన్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా మ్యాచ్‌ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘మేము రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ చాలా బలంగా ప్రారంభించాం. ఆర్చర్ రెండు కీలక వికెట్లు తీసిన వెంటనే మ్యాచ్ సగం మా చేతుల్లోకి వచ్చేసింది. మనీష్ పాండే మా నుంచి మ్యాచ్ తీసేసుకున్నాడు. పాండే, శంకర్ బాగా ఆడారు. ఆర్చర్‌కు వరుసగా మూడో ఓవర్ వేసే అవకాశం ఇవ్వాల్సింది. ఇతర బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేదు. బ్యాటింగ్ కూడా మేం అనుకున్న స్కోర్ చేయలేకపోయాము.’ అని స్మిత్ తెలిపారు.



Next Story