మంత్రినే ఒప్పించలేదు… వారిని ఎలా ఒప్పిస్తారు…

by  |
మంత్రినే ఒప్పించలేదు… వారిని ఎలా ఒప్పిస్తారు…
X

దిశ వెబ్ డెస్క్ :
కేంద్రంపై రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ నిప్పులు చెరిగారు. వ్యవసాయ బిల్లులపై సొంత మంత్రినే ఒప్పించలేని వాళ్లు రైతులను ఎలా ఒప్పించగలమని అనుకున్నారని ఆయన విమర్శించారు. ఇక నైనా కేంద్రం తన తప్పును గుర్తించి వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన తీరుపై అప్రజాస్వామిక ముద్ర పడిందని ఆయన అన్నారు. అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అసమ్మతి గళం వినిపిస్తోందని ఆయన అన్నారు. పెట్టుబడులు, సంస్కరణలు అవసరమేననీ, వాటిని తాము కూడా అంగీకరిస్తామని అన్నారు. కానీ కేంద్ర తీసుకువచ్చిన బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులనీ అందుకే వాటిని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు.


Next Story