నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

by  |
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అవిశ్వాస తీర్మానం పెడుతామని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అక్కడ ఏం జరగనున్నదో అని ఈ సమావేశాలపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తిరుగుబాటు చేసిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గం సొంత గూటికి చేరడంతో రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం సమిసిపోయింది. నిన్నమొన్నటి వరకు పతనం అంచునకు చేరిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సుస్థిరమైంది. కానీ, ప్రతిపక్షం తాజా నిర్ణయాలతో అక్కడ ఏమైనా జరగొచ్చు అన్న భావన అందరిలో మెదళ్లను తాకుతున్నది.



Next Story

Most Viewed