ఖమ్మంలో ఘోరరోడ్డు ప్రమాదం.. రాజస్థాన్ వాసి మృతి

by  |
ఖమ్మంలో ఘోరరోడ్డు ప్రమాదం.. రాజస్థాన్ వాసి మృతి
X

దిశ, ఖమ్మం రూరల్ ​: గుర్తు తెలియని వాహనం ఢీకుని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్​రాష్ట్రం దత్తునగర్‌కు చెందిన హర్జీ రామ్​(48) బతుకుదెరువు కోసం ఖమ్మం జిల్లాకు వచ్చి జీవనం సాగిస్తున్నాడు.

మండంలోని మద్దులపల్లి గ్రామ శివారులో రాత్రి సూర్యాపేట ప్రధాన రవాదారి వెంబడి హర్జీ రామ్ తల్లంపాడు వైపునకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్​రావు తెలిపారు.

Next Story

Most Viewed