నేను వచ్చే వరకు ఆగండి: రాజాసింగ్

by  |
నేను వచ్చే వరకు ఆగండి: రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ విమర్శలు చేశారు. తాను పర్యటనలో ఉండగా.. సడెన్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడాన్ని రాజాసింగ్ తప్పు బట్టారు. అత్యవసరంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

మున్సిపల్ చట్టంలో మార్పులు తీసుకొస్తామంటున్నా టీఆర్ఎస్ నేతలు.. గతంలో కూడా వాళ్లే మార్పులు
చేశారని గుర్తు చేశారు. గతంలో టీఆర్ఎస్ చేసిన మార్పుల పై ప్రస్తుతం వారికి నమ్మకం లేదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఎంఐంఎం పార్టీకి లాభం చేకూర్చేందుకే జీహెచ్ఎంసీ చట్టాల్లో మార్పులు తెస్తున్నారని ఆయన ఆరోపించారు. కారు టీఆర్ఎస్ ది అయితే, స్టీరింగ్ తమ చేతుల్లో ఉన్నట్టు ఎంఐంఎం నాయకులు వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ దుయ్యబట్టారు. బీజేపీ లేని సమయంలో సమావేశం వద్దని.. వారం రోజులు పోస్ట్ పోన్ చేయండి అంటూ రాజాసింగ్ డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed