పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా గోకవరం బాధితులను శుక్రవారం వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆందుకుంటుందని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి మాటలు విచారకరం అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత సీఎం చంద్రబాబు కూడా అనేక తప్పులు చేశారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ చర్చించి, త్వరలోనే పూర్తి [&hellip;]</p>

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా గోకవరం బాధితులను శుక్రవారం వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆందుకుంటుందని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి మాటలు విచారకరం అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత సీఎం చంద్రబాబు కూడా అనేక తప్పులు చేశారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ చర్చించి, త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. సీఎం జగన్ కేసులకు భయపడే వ్యక్తి కాదని వెల్లడించారు. ఇప్పటికే సీఎం జగన్ అన్యాయంగా 16 నెలలు జైలు శిక్ష అనుభించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story