బ్రేకింగ్ న్యూస్: ఐపీఎల్ నుంచి తప్పుకున్న రైనా

by  |
బ్రేకింగ్ న్యూస్: ఐపీఎల్ నుంచి తప్పుకున్న రైనా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా ఐపీఎల్ ఆటల నుంచి తప్పుకున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా ప్రకటించాడు. రైనా తప్పుకున్నట్లు సీఎస్కే జట్టు కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ సమయంలో రైనాకు, రైనా కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని సీఎస్కే జట్టు ట్విట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ జట్టుకు చెందిన పదిమంది క్రికెటర్లకు కరోనా సోకింది. తాజాగా రైనా కూడా తప్పుకోవడంతో సీఎస్కే జట్టుకు షాక్ మీద షాక్ తగిలినట్లయ్యింది.



Next Story

Most Viewed