- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్ : మెల్బోర్న్లో భారీ వర్షం కురియడంతో ఎంసీజీ మైదానంలో టీమ్ ఇండియా క్రికెటర్ల సాధనకు అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో క్రికెటర్లు ఇండోర్లో సాధన చేశారు. నెట్స్లో బ్యాటింగ్, బౌలింగ్ సాధన కుదరక పోవడంతో ఇండోర్లో ఫిట్నెస్ పెంచుకునే కసరత్తులకే పరిమితం అయ్యారు. వర్షం కారణంగా నెట్ ప్రాక్టీస్ చేయలేదని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
జనవరి 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లు సోమవారం మెల్బోర్న్ నుంచి ప్రయాణం కానున్నారు. కాగా, రోహిత్ శర్మ సహా మరో నలుగురు క్రికెటర్లను విడిగా ఐసోలేషన్లో ఉంచారు. న్యూ ఇయర్ సందర్భంగా వాళ్లు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి రెస్టారెంట్కు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ దీన్ని కొట్టిపారేసినా.. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం దీనిపై విచారణ చేపట్టింది.