- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో అంచనా కంటే ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రుతుపవనాల రాకతో ఇప్పటికే పలు జిల్లాలో శనివారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అయితే రుతుపవనాలు మొదటగా మహబూబ్ నగర్లోనికి ప్రవేశించినట్టు ఐఎండీ పేర్కొంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ మధ్య రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నట్టు అధికారులు తెలిపారు. నైరుతి రుతు పవనాల కారణంగా తెలంగాణ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Next Story