ఏపీ ప్రజలకు గమనిక.. మూడు రోజులు వర్షాలే..!

by  |
Rain in telangana
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బంగాళాఖాతం మీదుగా కోస్తా పైకి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో భారీగా మంచు కురుస్తోంది.

దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పు గాలులు, మంచు ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Next Story

Most Viewed