ప్రమోషన్ వచ్చింది.. ప్రాణం పోయింది

by  |
ప్రమోషన్ వచ్చింది.. ప్రాణం పోయింది
X

దిశ, స్టేషన్ ఘన్‎పూర్: ప్రమోషన్ తీసుకునేలోపే ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన స్టేషన్ ఘన్‌పూర్‌లో వెలుగుచూసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రియాజ్ అహ్మద్‌కు ఏఎస్‌ఐగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. శిక్షణాంతరం హైదరాబాద్‌ నుంచి స్వస్థలమైన హన్మకొండకు బయల్దేరిన రియాజ్‌ను మృత్యువు కబలించింది. సరిగ్గా ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లింగాల బైపాస్‌ రోడ్డు వద్దకు రాగానే కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.


Next Story

Most Viewed