వచ్చే నెలలో రాహుల్ గాంధీ​ పర్యటన.. కేసీఆర్‌ను నిలదీస్తాం

by  |
వచ్చే నెలలో రాహుల్ గాంధీ​ పర్యటన.. కేసీఆర్‌ను నిలదీస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు, పథకాలతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్ ​అన్నారు. దళిత బంధు పథకంతో చాలా అన్యాయం జరుగుతుందన్నారు. టీపీసీసీ కోర్​కమిటీ సమావేశం గాంధీభవన్‌లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఠాగూర్​ మాట్లాడారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు మరింత దూకుడుగా పని చేయాలని, మీటింగ్‌కు​రాని వాళ్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. వచ్చేనెల 17 వరకు దండోరా సభలు ఉంటాయని, సెప్టెంబర్​ 10 నుంచి 17 వరకు రాష్ట్రంలో రాహుల్​ గాంధీ పర్యటన ఉంటుందని వెల్లడించారు. రాహుల్​ గాంధీని ఎక్కడ సభకు తీసుకురావాలనే విషయం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఠాగూర్​ వివరించారు.


Next Story

Most Viewed