నేడు రాష్ట్రపతి భ‌వ‌న్‌కు రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌

by  |
నేడు రాష్ట్రపతి భ‌వ‌న్‌కు రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేకరించిన సంతకాలను రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌‌కు సమర్పించనున్నారు. అనంతరం రాష్ట్రపతితో భేటీ అయ్యి చట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరనున్నారు. అంతేగాకుండా రాహుల్ గాంధీ కాలినడకన రాష్ట్రపతిభవనానికి వెళ్లనున్నారు. విజ‌య్ చౌక్ నుంచి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌నున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ దేశ రాజ‌ధానిలోని శివారులో రైతుల ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది. అలాగే పంజాబ్‌, హ‌ర్యానాకు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నుంచి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర‌గా వెళ్ల‌నున్నారు.



Next Story

Most Viewed