వారి కుటుంబాలను ఆదుకోవాలి – రాహుల్ గాంధీ

by  |
వారి కుటుంబాలను ఆదుకోవాలి – రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లోని రాజధాని ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విట్ చేశారు. ‘రాయ్‌పూర్ ఆస్పత్రిలోని ఐసీయూలో అగ్ని ప్రమాదం విచారకరం. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నాను. ఇలాంటి విషాదకర సమయంలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలి. వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి’ అని ట్వీట్ చేశారు. కాగా శనివారం రాయ్‌పూర్‌లో రాజధాని ఆస్పత్రిలో ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed