- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అందించిన కెప్టెన్ అజింక్య రహానేకు ముంబయిలోని తన స్వగృహం వద్ద అనూహ్యమైన స్వాగతం లభించింది. భాజాభజంత్రీలతో ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. తన కూతురు ఆర్యను ఎత్తుకొని, భార్య వెంట నడుస్తూ అక్కడ జరుగుతున్న సంబరాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రహానే గొప్ప మనసు మరోసారి అందరికీ తెలిసింది. స్థానికులు ఒక కేక్ తెచ్చి దాన్ని కట్ చేయాలని కోరారు. అయితే ఆ కేక్పైన కంగారూ బొమ్మ ఉండటంతో ఆ కేక్ కట్ చేయడానికి నిరాకరించాడు. కంగారూ బొమ్మ ఉంచిన కేక్ను కట్ చేసి ఆ దేశాన్ని అవమాన పరచలేనని రహానే తెగేసి చెప్పాడు. ఈ తతంగం అంతా ముంబయిలోని ఒక లోకల్ న్యూస్ చానల్లో ప్రసారం కావడంతో రహానే గొప్ప మనసు అందరికీ తెలిసింది. రహానే గొప్ప కెప్టెన్ అవుతాడనటానికి ఇదో ఉదాహరణ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story