‘నవ హామీలు-వైఫల్యాలు’ పేరుతో సీఎం జగన్‌కు రఘురామ లేఖ

by  |
ragurama krishnamraju news
X

దిశ, ఏపీ బ్యూరో : నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తొమ్మిదో రోజూ కూడా సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ‘నవ హామీలు-వైఫల్యాలు’ పేరుతో జగన్‌కు లేఖను పంపించారు. ఈ సారి మద్యపాన నిషేధం హామీపై జగన్‌ను నిలదీశారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

మద్యాన్ని నిషేధిస్తారన్న ఆశతో మహిళలంతా వైసీపీకి ఓటేశారని చెప్పుకొచ్చారు. నిషేధం ఎలా ఉన్నా మద్య ప్రోత్సాహం మాత్రం ఎక్కువైందని లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు 16 శాతం పెరిగాయనడమే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని రఘురామ ఆ లేఖలో డిమాండ్ చేశారు.

Next Story