ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ

by  |
ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పొడిగింపుపై కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన లేఖ రాశారు. దూరదృష్టితో తీసుకున్న పరిపాలన నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు జరుగుతుందని లేఖలో రఘురామకృష్ణం రాజు తెలిపారు. మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ రఘురామకృష్ణంరాజు కొనియాడారు. కాగా, రఘురామకృష్ణం రాజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ఎంపీలు లాయర్లతో కలిసి వెళ్లి స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానికి ఆయన రాసిని లేఖ ఒడ్డున పడేస్తుందా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది.

Next Story