RRR డిశ్చార్జ్.. నేరుగా ఎయిర్‌పోర్టుకు..

by  |
RRR డిశ్చార్జ్.. నేరుగా ఎయిర్‌పోర్టుకు..
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డిశ్చార్జ్ అయ్యారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టుకు రఘురామకృష్ణంరాజు బయలుదేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వారంరోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు.

సుప్రీంకోర్టు కండీషనల్ బెయిల్ ఇవ్వడంతో.. రఘురామకృష్ణంరాజును నేరుగా ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed