లోన్ యాప్స్ కేసులో ముగ్గురు అరెస్ట్

by  |
లోన్ యాప్స్ కేసులో ముగ్గురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్స్ కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు వేధింపులపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయని, దీనికి సంబంధించి పుణెలో 600 మందితో ఈ కాల్ సెంటర్‌ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరశురామ్‌‌తో పాటు భార్య లియాంగ్, హెచ్ఆర్ మేనేజర్ ఆకిబ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 101 లాప్ ట్యాప్స్‌తో పాటు 106 మొబైల్స్, సీసీటీవీ కెమెరా, పలు కంపెనీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.



Next Story

Most Viewed