వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

by  |
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
X

దిశ, ఎల్బీనగర్ :
వ్యభిచార గృహంపై రాచకొండ యాంటీ హుమేన్ ట్రాఫిక్ యూనిట్, హయత్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనసురాబాద్ డివిజన్, లెక్చరర్స్ కాలనీ లో ఉయ్యాల యాదయ్య (49), భార్య చిట్టెమ్మ కలిసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ యువతులను ఇండియాలో పలు ఇండ్లలో పని చేసేందుకు రాహుల్ అనే వ్యక్తి దగ్గరకు పంపిస్తుంటారు. విదేశీ యువతులను ప్రేరేపించి రాహుల్ బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతాడు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్, జాషువా జిల్లాకు చెందిన ఓ యువతి (26) ని రాహుల్ బలవంతంగా ప్రేరేపించి వ్యభిచారంలోకి దింపాడు. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాముల గ్రామానికి చెందిన మోతే పు భాస్కర్, విదేశీ యువతితో వ్యభిచారం చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకులతో పాటు విటుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. వారి వద్ద బైకు, 4 సెల్ ఫోన్లు, రూ.700 నగదు, 6 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story