- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పస్తులుంచి పసి పిల్లలతో పని..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ పరిధిలో చిన్నపిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై రాచకొండ పోలీసులు కొరడా ఝులిపించారు. సోమవారం ఎర్రకుంటలోని గాజుల ఫ్యాక్టరీపై దాడులు చేసి 20మంది పిల్లలకు విముక్తి కల్పించారు. దీనిపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడారు. గయా, బీహార్కు చెందిన పిల్లలను అక్రమంగా తీసుకోచ్చి గాజుల తయారీ చేయిస్తున్నారని వెల్లడించారు. కనీసం వారికి సరైన భోజనం పెట్టకుండా అర్ధరాత్రి వరకు వెట్టిచాకిరి చేయిస్తున్నారని చెప్పారు. తనకు అందిన సమాచారం మేరకు పరిశ్రమపై దాడులు చేసి […]</p>

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ పరిధిలో చిన్నపిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై రాచకొండ పోలీసులు కొరడా ఝులిపించారు. సోమవారం ఎర్రకుంటలోని గాజుల ఫ్యాక్టరీపై దాడులు చేసి 20మంది పిల్లలకు విముక్తి కల్పించారు. దీనిపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడారు. గయా, బీహార్కు చెందిన పిల్లలను అక్రమంగా తీసుకోచ్చి గాజుల తయారీ చేయిస్తున్నారని వెల్లడించారు. కనీసం వారికి సరైన భోజనం పెట్టకుండా అర్ధరాత్రి వరకు వెట్టిచాకిరి చేయిస్తున్నారని చెప్పారు. తనకు అందిన సమాచారం మేరకు పరిశ్రమపై దాడులు చేసి 20మంది పిల్లలకు విముక్తి కల్పించామని తెలిపారు.పిల్లలకు మెడికల్ చెకప్ తర్వాత వారి స్వస్థలాలకు పంపిస్తామని వివరించారు. నిబంధలకు విరుద్ధంగా పనిచేయించిన నలుగురు ఆర్గనైజర్లను అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు.
Next Story






