- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : యాక్టర్ మాధవన్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ వీడియోతో షాక్ ఇచ్చాడు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పలు వీడియోలు షేర్ చేసిన మ్యాడీ.. పాండమిక్ టైంలో ప్యాసింజర్స్ లేని విమానంలో ఒక్కడే ప్రయాణించిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫస్ట్ వీడియోలో ఫ్లైట్లో ఒక్కరు కూడా లేకపోగా, కేవలం ఫ్లైట్ అటెండెంట్ వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. సిబ్బంది తప్ప ఎవరూలేని విమానంలో జర్నీ ఎక్స్పీరియన్స్ను వీడియో ద్వారా వివరించిన మాధవన్.. ‘నా జీవితంలో నిజంగా ఇది ఒక ప్రత్యేక క్షణం’ అంటూ బిజినెస్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు. అయితే అందులో కూడా ప్యాసింజర్స్ లేకపోవడం విశేషం. అంతేకాదు ఎయిర్పోర్ట్ లాంజ్, వెయిటింగ్ రూమ్స్ కూడా ఖాళీగా ఉండటాన్ని మరొక వీడియోలో చూపించాడు. ఇది జూలై 26న చిత్రీకరించినట్టు తెలుస్తుండగా.. ఈ జర్నీ కొంచె ఫన్నీగా, మరికొంచెం విచారంగా ఉందని తెలిపాడు మాధవన్. ప్రస్తుతం ‘అమెరికి పండిట్’ షూటింగ్ నిమిత్తం తను దుబాయిలో ఉన్నట్టు వెల్లడించాడు.