సామాజిక దృక్పథంతో సేవలందించాలి: ఎమ్మెల్యే  కేపీ వివేకానంద్

by  |
cath lab
X

దిశ, కుత్బుల్లాపూర్: కొంపల్లి మున్సిపాలిటీ సమీపంలోని శ్రీకర హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. క్యాథ్ ల్యాబ్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనుభవం కలిగిన వైద్యులచే క్యాథ్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. సాధారణ ప్రజలకు సేవా భావంతో వైద్యం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్ సువర్ణ, డాక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed