రైతులకు ఆన్‌లైన్‌‌లోనే రసీదు

by  |

దిశ, ఆదిలాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు రైస్ మిల్లర్లలను ఆదేశించారు. సోమవారం ఉదయం అదనపు కలెక్టర్ తన చాంబర్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లలతో సమావేశం అయ్యారు. రైస్ మిల్లుల వద్ద హమాలీలను పెంచుకోవాలని మిల్లర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆన్ లైన్‌లోనే రైతులకు రసీదులను అందించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకళ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపి పాల్గొన్నారు.

Next Story

Most Viewed