వైన్స్ వద్ద మందుబాబుల క్యూ.. బీర్ కాటన్లు, బాటిళ్లు..

by  |
వైన్స్ వద్ద మందుబాబుల క్యూ.. బీర్ కాటన్లు, బాటిళ్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రేపటి నుంచి పదిరోజుల పాటు లాక్‌డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ వల్ల నిత్యవసర సరుకుల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతినిచ్చింది సర్కార్.. ఈ నేపథ్యంలో మందుబాబులు మరోసారి వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. పలు ప్రాంతాల్లో మందుబాబులు మద్యం దుకాణాల ముందు లైన్లలో నిలుచున్నారు. కరోనా వేళ భౌతిక దూరం పాటించకుండా బారులు తీరారు. మరి కొన్ని చోట్ల మాస్కులు కూడా ధరించకుండా ప్రజలు మద్యం షాపుల మందు క్యూ కట్టారు. అయితే, నిత్యవసర సరుకుల షాపులతో పాటు వైన్స్ కూడా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తేరిచే ఉంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయం తెలియక మందుబాబులు పది రోజులకు సరిపడా మద్యం బాటిళ్లను ఈరోజు కొనుగోలు చేసుకుని తీసుకు వెళ్తుండం గమనార్హం.



Next Story

Most Viewed