- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న (అలియాస్ చింతపండు నవీన్)కు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తీన్మార్ మల్లన్న టీం సభ్యులు వెల్లడించారు. కాగా, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారని ప్రముఖ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ మల్లన్నపై కేసు నమోదు చేయగా కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. అయితే, ప్రస్తుతం తీన్మార్ మల్లన్న హైదరాబాద్లోని చంచల్గూడలో ఉన్న విషయం తెలిసిందే.
గురువారం మల్లన్నపై నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలించిన కోర్టు, అవి అక్రమంగా పెట్టారని కోర్టు అభిప్రాయపడిందని, పూర్తి విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేసినట్లు మల్లన్న తరపు న్యాయవాది తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సెక్షన్ 354 కేసు విచారణ జరుగనున్నట్టు తెలిపారు. మల్లన్నపై మూడు కేసులు నమోదవగా లక్ష్మీ కాంత శర్మ కేసులో మల్లన్నకు బెయిల్ మంజూరు అయినట్లు వారు వెల్లడించారు.