ఆ కంపెనీ ఉద్యోగులందరికీ బోనస్..!

by  |
ఆ కంపెనీ ఉద్యోగులందరికీ బోనస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సమయంలో నిరంతరాయంగా నిబద్ధతతో పనిచేసిన తమ ఉద్యోగులకు ప్రముఖ ఆడిట్ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా వన్-టైమ్ బోనస్‌కు ప్రకటించింది. సంస్థలోని 15 వేల మందికి ఇది వర్తిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది వ్యాపారలతో పాటు తమ కస్టమర్లకు అతిపెద్ద సవాలుగా మారిన ఏడాదిగా నిలిచింది. ఇలాంటి సందర్భంలో వ్యాపారాన్ని కొనసాగించడమే కాకుండా క్లయింట్లతో తమ బంధాన్ని కొనసాగించడంతో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. అందుకే ఈ బోనస్‌ను అందించనున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్మన్ సంజీవ్ క్రిషన్ చెప్పారు. ఉద్యోగుల కృష్టి వల్లే వచ్చే ఆర్థిక సంవత్సరం.. తమ కార్యకలాపాలు ఆశాజనకంగా ఉంటాయనే నమ్మకం ఏర్పడిందని, దీన్ని గుర్తిస్తూ పీడబ్ల్యూసీ ఇండియా ఉద్యోగులకు మార్చి జీతంతో కలిపి ఉద్యోగులందరికీ రెండు వారాల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story