బిగ్ బ్రేకింగ్.. ఒలంపిక్స్‌లో పీవీ సింధు ఘన విజయం.. పతకం సొంతం

by  |
pv-sindu
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో బ్యాట్మింటన్‌లో భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆదివారం జరిగిన పోరులో చైనా షట్లర్ జియావోపై ఘన విజయం సాధించింది. రెండు వరుస సెట్లలో 21-13, 21-15 తేడాతో ప్రత్యర్థిపై భారీ విజయాన్ని అందుకుంది.

ఆట ప్రారంభమైన సమయం నుంచే ప్రత్యర్థిపై అద్భతమైన స్మాష్ షాట్స్‌లో విరుచుకుపడిన సింధు.. రెండు సెట్లలోనూ జియావోకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తన ఖాతాలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అయితే, వరుస ఒలంపిక్స్‌లో పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారిణిగా పీవీ సింధూ రికార్డు సాధించారు.


Next Story

Most Viewed